హైదరాబాద్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, హిందూ ధార్మిక సంఘాల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేక ఆందోళన కారులు నినాదాలు చేశారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పోలీసులు, పలువురికి గాయాలయ్యాయి. ఆందోళనకారులు పోలీసులపైకి వాటర్ ప్యాకెట్లు, కుర్చీలు విసిరారు. అక్టోబరు 14న ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో భారీ భద్రతను మోహరించారు.
గత వారం సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని నిరసిస్తూ స్థానిక వ్యాపారులు పిలుపునిచ్చిన బంద్కు వందలాది మంది భక్తులు తరలిరావడంతో శనివారం అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా పెద్దఎత్తున హిందూ ధార్మిక సంఘాల కార్యకర్తల గుమిగూడారు. దీంతో భారీ పోలీసు బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. పరిస్థితి అదుపులో ఉందని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెబుతున్నారు. అటు పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ గ్రూప్-1 పరీక్షల ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అశోక్నగర్ క్రాస్ రోడ్కు చేరుకోవడంతో అశోక్నగర్ ప్రాంతంలో కూడా ఉద్రిక్తత నెలకొంది.