calender_icon.png 21 October, 2024 | 4:09 AM

మలేషియా తెలంగాణ అసోసియేషన్‌కు పదేండ్లు

21-10-2024 01:25:06 AM

దశాబ్ది ఉత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): మలేషియా తెలంగాణ అ సోసియేషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావాలని అసోసియేషన్ ఆహ్వానించింది. నవంబర్ 9వ తేదీన కౌలాల ంపూర్‌లోని జరిగే ఉత్సవాలకు మలేషియాలోని తెలంగాణ వాసులు పెద్దఎత్తున హాజరవుతారని తెలిపింది.

ఆదివారం కేటీఆర్‌ను అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కేటీఆర్ నివాసానికి వెళ్లి ఆ హ్వానం అందించారు. కేవలం మలేషియాలోని తెలంగాణ వాసులే కాకుం డా అనేక దేశాల నుంచి ఈ ఉత్సవాలకు తెలంగాణ ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా, ఏ దేశం వెళ్లినా తెలంగాణ ప్రాంతీయులు రా ష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని గుర్తు చేశా రు. మలేషియాలో తెలంగాణ వాసులకంటూ ఒక ప్రత్యేక సంస్థను ఏర్పా టు చేసుకొని అనేక రకాల కార్యక్రమాల్లో తెలంగాణ గడ్డతో మమేకం కావడం పట్ల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు కార్తీక్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.