ఎల్బీనగర్, అక్టోబర్ 3: బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫలక్నుమాలోని వట్టేపల్లికి చెందిన అబ్దుల్ మజీద్ (23) సరూర్నగర్లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో హౌస్ కీపింగ్గా పనిచేసేవాడు. కాగా, ఒక మైనర్ విద్యార్థిపై అసహజ పద్ధతిలో లైంగికదాడికి పాల్పడ్డాడు.
దీనిపై 2018లో సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. ఎల్బీనగర్లోని ఫాస్ట్ట్రాక్ కోర్టు కేసును విచారించింది. పూర్తివాదనల అనంతరం కేసులో మజీద్ను దోషిగా నిర్ధారిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.16 వేల జరిమానా విధించారు. అదేవిధంగా బాధితుడికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.