హైదరాబాద్: తెలంగాణలో 10 మంది బెటాలియన్ కానిస్టేబుల్స్ ను తెలంగాణ స్పెషల్ పోలీస్(టీజీఎస్పీ) డిస్మిస్ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆందోళన చేస్తున్న వారిని తొలగిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బెటాలియన్స్లో అశాంతికి పది మంది కానిస్టేబుల్స్ కారణమని ఆరోపణ ఉన్నాయి. ఇటీవలే 39 మంది ప్రత్యేక పోలీసు కానిస్టేబుళ్లను సస్పెన్షన్లో ఉంచిన ఒక రోజు తర్వాత ఈ తొలగింపులు జరిగాయి.
టీజీఎస్పీ అదనపు డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ జైన్ అధికారిక ప్రకటన ప్రకారం, హైదరాబాద్తో సహా తెలంగాణ అంతటా బెటాలియన్ ప్రాంగణంలో, బహిరంగ ప్రదేశాల్లో సిబ్బంది నిరసనలను ప్రేరేపించారు. మానుకోవాలని పదేపదే హెచ్చరించినప్పటికీ నిరసనలు చేశారు. క్రమశిక్షణా చర్యను అమలు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తొలగించబడిన సిబ్బందిలో వివిధ బెటాలియన్లకు చెందిన వ్యక్తులు ఉన్నారు. వారిలో జి. రవి కుమార్ (3వ బెటాలియన్, ఇబ్రహీంపట్నం), కె. భూషణ్ రావు (6వ బెటాలియన్, బి. కొత్తగూడెం), మరియు వి. రామ కృష్ణ (12వ బెటాలియన్, అన్నెపర్తి) ఉన్నారు.