06-04-2025 05:27:46 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభోగంగా నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ దంపతులు కళ్యాణ ఉత్సవాలలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం ఆలయ పూజారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దంపతుల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులు శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి సీతారాముల విగ్రహాలకు అక్షింతలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.