06-03-2025 12:33:39 AM
రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్ మృతి
షాద్నగర్, మార్చి 5 (విజయక్రాంతి): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మ తెలుగు విద్యార్థి దుండగుడి కాల్పుల్లో బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు, రమాదేవి మెడికల్ దుకాణం నడుపుతున్నారు.
వీరికి కొడుకు ప్రవీణ్(27), కూతురు ఉన్నారు. ప్రవీణ్(27) అమెరికాలోని విస్కాన్సిన్ మిల్వాకీలో నివాసం ఉంటూ ఓ యూనివర్సిటీలో ఎంఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఖర్చుల కోసం ఓ హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. బుధవారం అతడి ఇంటి సమీపంలోని బీచ్లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడటంతో ప్రవీణ్ తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతిచెందాడు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తీవ్ర విషాదంలో మునిగారు.