మంచిర్యాల,(విజయక్రాంతి): పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం గిడుగు వెంకట రామమూర్తి జయంతి పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన తెలుగు భాషకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగ శర్మ, వైస్ ప్రిన్సిపల్ పత్తి సునీత, తెలుగు విభాగాధిపతి రజిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.