calender_icon.png 23 September, 2024 | 1:01 AM

మొదలైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్

28-07-2024 11:48:57 AM

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ఆదివారం మొదలైంది. దిల్ రాజు పదవీకాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష బరిలో ఠాగూర్ మధు, భరత్ భూషణ్, ఉపాధ్యక్ష బరిలో అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి నిలిచారు. ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ఓటు హక్కు వినియెగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకోనున్నారు. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్ లోని సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 25 ఓట్ల మెజార్టీ ఎవరి వస్తే వారే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా ఎన్నికవుతారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు రెండేళ్లకోసారి జరుగుతాయి.