calender_icon.png 6 October, 2024 | 9:54 PM

గల్ఫ్ కార్మికుడు మృతి

04-09-2024 12:34:04 PM

రాజన్న సిరిసిల్ల:  రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అన్నవేని స్వామి (32) అనే యువకుడు ఉపాధి నిమిత్తం యూఏఈ దేశం వెళ్ళాడు. అక్కడ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంత కాలంగా స్వామి అనారోగ్యం బారిన పడడంతో దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆరోగ్యం కుదుట పడకపోవడంతో గత రెండు రోజుల క్రితం దుబాయ్ నుండి నేరుగా కరీంనగర్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

స్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లో ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత రాత్రి స్వామి చికిత్స పొందుతూ మరణించాడు. ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన స్వామి విగత జీవిగా ఇంటికి తిరిగి రావడంతో అతని భార్య పిల్లలు రోదిస్తున్న తీరు అందరి హృదయాలను కలిచి వేసింది. స్వామిని బ్రతికించుకోవడానికి కరీంనగర్ హైదరాబాద్ తీసుకెళ్లిన కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. స్వామి కుటుంబాన్నీ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్థులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మృతుడు స్వామి కి భార్య ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు.