calender_icon.png 27 September, 2024 | 8:58 PM

నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్

27-09-2024 05:44:02 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలంలోని నాగోబా ఆలయాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్  నేరెళ్ళ శారద సందర్శించారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయ అర్చకులు, స్థానికులు చైర్పర్సన్ కు ఘనస్వాగతం పలికారు. నాగోబా కు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు, స్థానికులతో మాట్లాడి ఆలయ చరిత్ర, నిర్వహించే పూజల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి విపత్తులు, కరువులు సంభవించకుండా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, అందరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నగదేవతను కోరుకున్నామన్నారు.