calender_icon.png 30 September, 2024 | 6:57 PM

తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పంటించారు..

30-09-2024 04:56:29 PM

చౌటపల్లి అఖిలపక్ష నాయకుల డిమాండ్

హుస్నాబాద్ (విజయక్రాంతి): అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ తల్లి పై కప్పివుంచిన బట్టకు నిప్పు అంటించారని దానివల్ల విగ్రహం కూడా పాక్షికంగా దగ్ధమైందని తెలిపారు. విగ్రహానికి నిప్పు పెట్టిన  వ్యక్తులను త్వరగా పట్టుకొని కేసు నమోదు చేసి దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పులికాసి రమేష్, పత్తిపాక త్రిమూర్తి, కుక్కల సంపతి, ఆవుల వెంకటరాజు, ఇల్లందులో రమేష్, తదితరులు పాల్గొన్నారు.