calender_icon.png 17 October, 2024 | 5:54 AM

కంచి విశ్వవిద్యాలయానికి 86 మంది తెలంగాణ విద్యార్థులు

17-10-2024 01:08:59 AM

కంచి స్వామీజీని దర్శించుకున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): కంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో వివిధ ఉన్నతస్థాయి కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి చెందిన 86 మంది చేరారు. వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థినీవిద్యార్థులకు స్వామీజీ శంకర విజయేంద్ర సరస్వతి ఆశీర్వచనాలు అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ బుధవారం కంచి కామకోటి పీఠానికి వెళ్లి కంచి స్వామీజీ విజయేంద్ర సరస్వతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో చేరిన తెలంగాణకు చెందిన విద్యార్థులతో శైలజా రామయ్యర్ సమావేశమయ్యారు.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన ఈ విశ్వవిద్యాలయంలో అత్యంత నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారని శైలజా రామయ్యర్‌కు విద్యార్థులు తెలిపారు. అనంతరం కంచి చిన్న స్వామీ విజయేంద్ర సరస్వతిని కలిసి వారి ఆశీర్వచనం పొందిన శైలజా రామయ్యర్ తెలంగాణ విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.