రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టిన వాహనం
నిజామాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): పిలిప్పిన్స్లో జరిగిన రోడ్డు ప్రమా దంలో తెలంగాణ కు చెందిన వైద్య విద్యార్థి మృతి చెం దాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్కు మండల కేంద్రానికి చెందిన అక్షయ్(24) పిలిప్పిన్స్లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం అక్కడ అక్షయ్ బైక్పై వె ళ్తుండగా రాంగ్ రూట్లో వచ్చిన మ రో వాహనం బైక్ను ఢీకొట్టడంతో మృతిచెందాడు. మరో ఆరు నెలల్లో అక్షయ్ కోర్సు పూర్తవ్వనుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్షయ్ తండ్రి రాజన్న స్వేరోస్ మాజీ అధ్యక్షుడు.