వికారాబాద్ రూరల్, (విజయక్రాంతి): ఎంతోమంది త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ఆవరణ, వికారాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన సాయుధ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.