నిజామాబాద్, ఫిబ్రవరి4 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర 3వ పోలీస్ స్పోరట్స్అండ్ గేమ్స్ మీట్- 2025 కరీంనగర్ లో జరిగినది. ఈ స్పోరట్స్ మీట్ లో బాసర జోన్-2, తరపున నిజామాబాద్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటరు. వివిధ క్రీడా రంగాలలో రాణించిన నిజామాబాద్ పోలీస్ క్రీడాకారులు 61మంది పాల్గొని పోటీలలో పాల్గొని, నిజామాబాద్ కు గొప్ప పేరు తెచ్చి 26 పతకాలు వివిధ కేటగిరీలలో సాధించారు.
కరీంనగర్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సి.హెచ్.సింధు శర్మ, ఐ.పీ.ఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో, అడిషనల్ డీ.సీ.పీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి, గారు, అడిషనల్ డీ.సీ.పీ (ఏ.ఆర్) కె. రామ్ చందర్ రావ్ , స్పెషల్ బ్రాంచ్ ఏ.సి.పి, శ్రీనివాసరావు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు హెచ్.సతీష్(అడ్మిన్), యు. తిరుపతి (ఎంటీవో), కె. శ్రీనివాస్ (వెల్ఫేర్), శ్రీ శేఖర్, పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు ఉన్నారు.