calender_icon.png 23 October, 2024 | 8:52 AM

సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో తెలంగాణకు విముక్తి

17-09-2024 02:00:31 PM

బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి

మంచిర్యాల,(విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయం, అర్చన టెక్స్ చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆనాడు భారత దేశానిక్ స్వాతంత్ర్యం వచ్చిన హైదరాబాద్ రాష్ట్రంలో కొనసాగుతున్న నిజాం, రజకర్ల పాలనను పోలీస్ చర్యతో నిజాం నిరంకుశ పాలనను అంతం అందించి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కల్పించి స్వాతంత్ర్యం అందించడం జరిగిందని తెలిపారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలు అధికారికంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రజనీష్ జైన్, పట్టి వెంకట కృష్ణ, బింగి ప్రవీణ్, జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేష్, ముదాం మల్లేష్, నాగుల రాజన్న, వైద్య శ్రీధర్, అమీరిశెట్టి రాజు, బండి మల్లికార్జున్, బోయిని దేవేందర్, అర్నక్కండ శ్రీనివాస్, ఎల్కపల్లి పవన్, కల్వచర్ల అనిల్,  తతిదరులు పాల్గొన్నారు.