వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
మెదక్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ కల సాధ్యమైందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్స వంలో భాగంగా మంగళవారం ఆయ న మెదక్ కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజలకు విముక్తి కలిగిచేందుకు ఎందరో యో ధులు, స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నదన్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు. ప్రజలజ బాగు కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పాలన యంత్రాం గానికి అభినందనలు తెలిపారు. వేడుకలో కలెక్టర్ రాహుల్రాజ్, ఎమ్మెల్యే రోహిత్రావు, పాల్గొన్నారు.