26-02-2025 01:26:37 AM
పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం
బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): తమ ప్రభుత్వం తొలినాటి నుంచి పరిశోధనలు, ఆవి ష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా హైదరాబాద్ను అభి వృద్ధి చేయాలనే ప్రణాళికతో ముందుకుపోతున్నా మన్నారు.
తెలంగాణలో ఉన్న అనుకూలతలు, తమ ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలని, మాతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. సులభ మైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపా యాలు, ఆశించినంత మద్దతు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రెండురోజుల పాటు హెచ్ఐసీసీలో జరగనున్న బయోఆసియా సదస్సును రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ను బయో ఏషియా ప్రపంచ లైఫ్ సెన్సైస్ రాజధానిగా నిలబెట్టిందని, హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశిస్తోం దన్నారు.
హైదరాబాద్ కోర్సిటీ వెలుపల ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మాన్యుఫాక్షరింగ్ హబ్గా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటిగా దీన్ని నెలకొల్పుతామన్నారు. చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచం నలుమూలాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామన్నారు.
హైదరాబాద్ను పవర్ హౌస్గా నిలుపుకున్నాం..
బయోసెన్సైస్, బయోటెక్, లైఫ్ సెన్సైస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ కేంద్రంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. సోమవారం హైదరాబాద్లో అమ్జెన్ సంస్థ తమ కార్యకలాపాలను విస్తరించిందని, ఇది తమ సహకారానికి నిదర్శనమన్నారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇక్కడ అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉన్నట్లు స్పష్టం చేసారు.
ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో, తెలంగాణ రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులను సాధించినట్లు చెప్పారు. ఈ ఒప్పందాల ద్వారా విభిన్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు త్వరలో రానున్నట్లు చెప్పారు. గతేడాది లైఫ్ సెన్సైస్ రంగంలో రూ.40,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించామని, దాదాపు 150పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబ డులు విస్తరించాయని సీఎం పేర్కొన్నారు.
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద కీలకమైన చొరవ అయిన గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయని, జర్మన్ కంపెనీ మిల్టెని బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్, జన్యు చికిత్సను ప్రారంభించినట్లు చెప్పారు.
బయోఆసియా వేదికపై మరో నాలుగు బహుళజాతి కంపెనీలను జీనోమ్ వ్యాలీలోకి వస్తున్నట్లు చెప్పారు. గత 25 సంవత్సరాల్లో హైదరాబాద్ ఫార్మా తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్ రంగాల్లో పవర్ హౌస్గా పేరు నిలుపుకున్నట్లు చెప్పారు. గతేడాది హెల్త్కేర్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహిచామన్నారు. బయోఆసియా సదస్సుకు హాజరైన అందరూ తెలంగాణను అనువైన వేదికగా ఉపయోగించుకుంటారని సీఎం ఆశించారు.
తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా..
ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయన్నారు. మేం ఇంతకాలం ఉన్నత విద్యపై పెట్టుబడులు పెట్టామని, ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆయా రంగాల్లో శాస్త్ర నిపుణులు, ఇంజనీర్ల స మూహాన్నీ తయారు చేశామన్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో తెలంగాణను ఒక ట్రిలియన్ డాల ర్ల రాష్ర్ట ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియాలో సేవల రంగానికి ప్రాధాన్యమిస్తామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ తో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామన్నా రు. ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా హైదరాబాద్ అవతరించినట్లు పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇక్కడ జరుగుతున్నట్లు చెప్పారు.
3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నామని, ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ను రేడియల్ రోడ్లతో అనుసంధానిస్తామని చెప్పారు. అంతేకా కుండా, ఈ రహదారులకు ఇరువైపులా క్లస్టర్లను కూడా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఒక మెగా డ్రై పోర్టు ను అభివృద్ధి చేసి, ఇక్కడి నుంచి ఏపీలోని సీ పోర్ట్కు అనుసంధానం ఉండేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపర్చే ఆలోచనలో తమ ప్రభు త్వం ఉన్నట్లు పేర్కొన్నారు.