హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జీవో 99పై స్టే విధించాలని కేఏ పాల్ కోరారు. హైడ్రా కూల్చివేతలు తక్షణమే నిలిపివేయాలని కేఏపాల్ పిటిషన్ లో కోరారు. హైడ్రాకు చట్టబద్దత కల్పించాకే కార్యాచరణ చేపట్టాలని పాల్ అన్నారు. అక్రమ కట్టడాలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రతివాదులైన హైడ్రా, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖాలు చేయాలని హైకోర్టు ఆదేశించారు. విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.