హైదరాబాద్,(విజయక్రాంతి): మేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా పడ్డింది. చెన్నమనేని ఏ పాస్ పోర్టుపై ట్రావెల్ చేస్తున్నారని, అతనికి ఇండియన్ పాస్ పోర్టు ఉందా అని హైకోర్టు ప్రశ్నించారు. చెన్నమనేనికి ఇండియన్ పాస్ పోర్టులేదని, జర్మనీ పాస్ పోర్టుపైనే ట్రావెల్ చేస్తున్నారని ఆయన తరుపు న్యాయవాదులు కోర్టు తెలిపారు. చెన్నమనేని పిటిషన్ పై అన్ని వాదనలను పరిగణనలోకి తీసుకున్నామన్న తెలంగాణ హైకోర్టు తదుపరి తీర్పును రేపటికి వాయిదా వేసింది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు చేస్తూ గతంలో కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఉత్తర్వులను రద్దు చేయాలన్న చెన్నమనేని పిటిషన్ పై తీర్పు వాయిదా పడ్డింది.