14-03-2025 07:47:50 PM
భీమదేవరపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ఎమ్మార్పీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాదిగ , రేణిగుంట్ల బిక్షపతి మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ చట్టం చేస్తామని ఒకవైపు చెప్తూ వర్గీకరణ లేకుండా పరీక్ష ఫలితాలు విడుదల చెయ్యడమంటే మాదిగలను మోసం చెయ్యడమే అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలు తర్వాతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఉద్యోగా ఫలితాలు, నియాకాలు నిలుపుదల చెప్పట్టాలని డిమాండ్ తో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు భీమదేవరపల్లి మండల్ ముల్కనూర్ అంబెడ్కర్ కూడలి వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ దీక్షలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల బిక్షపతి మాదిగ, ఎమ్మార్పీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాదిగ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మరియు ఇతర ఉద్యోగ నియామకాల పరీక్ష ఫలితాలు విడుదల చేస్తూ మాదిగల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఆగస్టు 1 నాడు అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు వర్గీకరణ ఇచ్చిన తీర్పును ఒకవైపు స్వాగతిస్తునే, వర్గీకరణ చట్టం అమలు తర్వాతే ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేపడుతామని, అలాగే అదే సమయంలో పాత నోటిఫికేషన్లకు ఆర్డినెన్సు తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పి, అదే సమయంలో డాక్టర్ షమిం అక్తర్ ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ వేసి రిపోర్ట్ తెచ్చుకొని ఇంకా వర్గీకరణ చట్టాన్ని అమలు చెయ్యకుండా ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలు విడుదల చెయ్యడమంటే ఈ రాష్ట్రంలో మాదిగలను లేకుండా చేసే కుట్రలు జరుగుతాయని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో 32 లక్షల మాదిగ సామాజిక వర్గం ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీక్షలో గాంధీనగర్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాళ్ల పెళ్లి రాజయ్య, తాళ్ల పెళ్లి ఐలయ్య, తాళ్ల పెళ్లి కుమారస్వామి, తాళ్ల పెళ్లి విద్య సాగర్, తాళ్ల పెళ్లి రామానుజన్, తాళ్లపల్లి రాజు, తాళ్ల పెళ్లి రాజయ్య, చిన్న తాళ్ల పెళ్లి రవీందర్, మంద జెస్సి ,తాళ్ల పెళ్లి అరవింద్, ప్రతాప్ తూముల కరుణాకర్ బహుజన నాయకులు తూముల స్వామి, తాళ్లపల్లి అశోక్, తదితరులు పాల్గొన్నారు.