calender_icon.png 23 September, 2024 | 9:51 PM

తెలంగాణలో 'దేవర' టికెట్ ధరల పెంపు..

23-09-2024 07:52:34 PM

హైదరాబాద్: సినీ ప్రియులకు సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ ఏన్టీఆర్ నటించిన 'దేవర' సిన్మా టికెట్ల ధరలను తెలంగాణలో పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటి గంట షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 29 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటి గంట షోలకు రూ. 100 టికెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం ఒకే చెప్పింది. మొదటి రోజు ఉదయం 4 నుంచి 6 గంటల షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదటి రోజు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టికెట్ ధర రూ. 100 పెరగనుంది. ఈ నెల 28నుంచి అక్టోబర్ 6 వరకు 9 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు అమలులో ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 25, మల్టీఫ్లెక్స్ లో రూ. 50 పెంచడాని అనుమతినిచ్చింది.