calender_icon.png 6 October, 2024 | 6:06 PM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లను నియమించిన సర్కార్

06-10-2024 03:05:13 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో పలు జిల్లా గ్రంథాలయ సంస్థలకు చైర్మన్ లను రాష్ట్రం ప్రభుత్వం నియమించింది. నిర్మల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సయ్యద్ అర్జుమంద్ అలీ, సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నాగుల సత్యనారాయణ గౌడ్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సత్తు మల్లయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎలుగంటి మధుసూధన్ రెడ్డి, వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా జి. గోవర్ధన్, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా గొల్ల అంజయ్య, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మద్ది చంద్రకాంత్ రెడ్డి, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సుహాసిని రెడ్డి, నారాయణ్ పేట్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వరాల విజయ్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా జి.రాజేందర్, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా శేరి రాజేశ్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మల్లు నరసింహారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నీలి శ్రీనివాసులను నియమిస్తూ ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.