calender_icon.png 18 October, 2024 | 6:01 PM

తొమ్మిది యూనివర్సిటీలకు కొత్త వీసీలు

18-10-2024 03:50:02 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీలకు కొత్త వీసీలను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వీసీల నియామక పత్రాలపై తెలంగాణ గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేశారు. దీంతో అధికారికంగా తెలంగాణ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా నియమితులైన వీసీలు వీరే...

ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం.కుమార్‌, 

పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్‌ శ్రీనివాస్‌, 

శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్‌ కుమార్‌, 

కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్‌ రెడ్డి, 

మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్‌ హుస్సేన్‌, 

తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరి రావు, 

తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు, 

వ్యవసాయ యూనివర్సిటీ వీసీగా అల్దాస్‌ జానయ్య, 

హార్టికల్చర్‌ వర్సిటీ వీసీగా రాజిరెడ్డి.