- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు
- రాష్ట్రంలో పెట్టుబడులకు జర్మనీలోని రైన్లాండ్ ఆసక్తి
- మంత్రితో రైన్లాండ్ ఉన్నతస్థాయి బృందం భేటీ
హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వాములకు జర్మనీలోని రైన్లాండ్ రాష్ట్రం ఆసక్తి కనబర్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు.
రైన్లాం డ్కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఆ రాష్ట్ర ఆర్థిక, రవాణా, వ్యవ సాయ మంత్రి డానియేలా ష్మిట్ ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో శ్రీధర్బాబుతో భేటీ అయింది. ఈ సమావేశంలో చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కూష్లెర్, హైదరాబాద్ గౌరవ కాన్సుల్ అమితా దేశాయ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రసాయనాలు, ఫార్మా ఉత్పత్తి, బయోటెక్నా లజీ, వ్యాక్సిన్లు, ప్యాకేజింగ్, పౌల్ట్రీ, వ్యవసాయం, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో భాగస్వాములు అవడం, పెట్టుబడులు పెట్టే అవకాశాలపై చర్చ జరిగింది. సులభతర వాణిజ్య విధానాలు, తక్షణ అనుమతుల జారీలో తెలంగాణ అగ్రగామిగా ఉందని శ్రీధర్బాబు ప్రతినిధి బృందా నికి తెలిపారు.
నూతన ఆవిష్కరణలు, ఆధునిక తయారీ, పరిశోధనలను ప్రోత్సహించే ప్రపంచస్థాయి వ్యవస్థను నిర్మించడంపై రాష్ట్రం దృష్టి పెట్టిందని ఆయన వెల్లడించారు. రెండు ప్రాంతాల మధ్య సారూప్యతల ను గుర్తించడం ద్వారా పరస్పర ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తే బాగుంటుందని శ్రీధర్బాబు వివరించారు.
లైఫ్ సైన్సెస్, ఫార్మా పెట్టుబడులకు తెలంగాణ ప్రపంచస్థాయి గమ్యస్థానంగా నిలుస్తోందని ఆయన చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతతోపాటు అత్యున్నత మౌలిక సదుపాయాలతో పరిశ్రమ దృష్టిని ఆకర్శిస్తోందని తెలిపారు. హైదరాబాద్లో జరిగే బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని శ్రీధర్బాబు కోరారు.
రైన్లాండ్, తెలంగాణ రాష్ట్రాలు ఇకపై ‘సిస్టర్ స్టేట్’ సహకార సంబంధాలు కలిగి ఉండాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. రైన్లాండ్ను సందర్శించి అక్కడి అభివృద్ధిని పరిశీలించాలని ష్మిట్ బృందం శ్రీధర్బాబును ఆహ్మానించింది. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ విభాగం సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.