హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమయ్యే సమయంలో మార్పు ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 12723 నెంబర్ గల తెలంగాణ ఎక్స్ప్రెస్ శుక్రవారం ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరాల్సి ఉండగా, అనివార్య కారణాలతో అదే రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రయాణీకులు గమనించాలని సూచించారు.