calender_icon.png 22 October, 2024 | 5:00 PM

సీఎం సహాయం నిధికి విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం

22-10-2024 02:17:14 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధికి అనేక ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పెద్ద మొత్తం సహాయం అందజేస్తున్నారు. తాజాగా విద్యుత్ ఉద్యోగులు సైతం మేమున్నామంటూ ముందుకు వచ్చారు. రాష్ట్రంలోని  70,585 విద్యుత్ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వం చేపడుతున్నా వినూత్న కార్యక్రమాలకు ఆసరాగా తమ ఒకరోజు మూలవేతనాన్ని అందజేశారు. మంగళవారం ఉదయం విద్యుత్ ఉద్యోగులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి  రూ.18.69 కోట్ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, జేఎండీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.