హైదరాబాద్ : తెలంగాణ డీఎస్సీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయిని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూలై 11వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది.
కాగా, డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని గత కొద్దిరోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. టెట్ పరీక్ష నిర్వహించిన వెంటనే డిఎస్సీ పరీక్ష నిర్వహించడం సరికాదని, రెండు పరీక్షల సిలబస్ వేర్వేరు కాబట్టి ప్రిపరేషన్ కు సమయం కావాలని డిమాండ్ చేశారు. అయిన ప్రభుత్వం స్పందించకపోవడంతో అభ్యర్థులు సోమవారం విద్యాశాఖ కార్యాలయాన్ని మట్టడించారు.