calender_icon.png 26 October, 2024 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలకాంశాలపై చర్చ

26-10-2024 11:14:17 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. వ్యవసాయ, రెవెన్యూ, సంక్షేమ పథకాలపై కీలక అంశాలే అజెండాగా రాష్ట్ర కేబినేట్ భేటీ అవుతోంది. జీవో 317, ఉద్యోగుల పెండింగ్ డీఏలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ పలు నిర్ణయాలను తీసుకోనుంది. బీసీ కులగణన షెడ్యూల్ ను ఖరారు, కొత్త ఆర్వోఆర్ బిల్లులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. మూసీనది పునరుజ్జీవం, హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లపైనా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేల నిర్వహణపై మంత్రి చర్చించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అక్టోబర్ 23న ప్లాన్ చేయగా, అక్టోబర్ 20 నుంచి 25 వరకు దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు దక్షిణ కొరియాలో అధ్యయన పర్యటన చేసేందుకు సమావేశాన్ని అక్టోబర్ 26కి మార్చారు.