calender_icon.png 20 September, 2024 | 2:04 PM

సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

20-09-2024 12:13:29 PM

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. రాష్ట్రంలో వరద బాధితులకు సాయంపై కేబినెట్ సమావేశం కానుంది. వర్సిటీల పేర్ల మార్పుపై నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పేర్ల మార్పుపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి, ఐఐహెచ్ టీకి కొండా లక్ష్మణ్ పేరుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అటు హైడ్రాకు చట్టబద్దత, ప్రత్యేక పోలీసు స్టేషన్ల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించే అవకాశముంది.