మాజీ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్యవిద్యకు తెలంగాణ కేరాఫ్గా నిలిచిందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం తమ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని ఎక్స్ వేదికగా ప్రకటించారు. నాడు అందని ద్రాక్షగా ఉన్న వైద్యవిద్య, నేడు సాధారణ ప్రజలకు చేరువైందన్నారు.
60 ఏళ్ల ఉమ్మడి పాలనలో 5 మెడికల్ కాలేజీలు ఉండగా, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 34కు చేరిందని అన్నారు. 2014 వరకు తెలంగాణలో 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవని.. అవి నేడు 8,490 సీట్లకు పెరిగాయని తెలిపారు. ఇది కేసీఆర్ మార్క్ పాలన అని ట్వీట్ చేశారు.