12-02-2025 05:04:18 PM
బైంసా (విజయక్రాంతి): బైంసాలో ఈనెల 15న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఉద్యమకారులు-ముధోల్ నియోజకవర్గం చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల జిల్లా ఫోరం అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణా గౌడ్, రచయిత పుండ్ డలికరావు భైంసాలో తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు, విద్య, వైద్య, న్యాయ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక కర్షక, విద్యార్థి, మీడియా, కుల సంఘాల, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.