పుదుచ్చేరి: ఆస్ట్రేలియాతో అండర్ వన్డే సిరీస్లో భాగంగా టీమిండియా కుర్రాళ్లు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. సోమవారం జరిగిన రెండో వన్డేలో ఇండియా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. ఆడిసన్ షెరిఫ్ (39) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 22 ఓవర్లలో వికెట్ నష్టపోయి 177 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిల్ పరాఖ్ (75 బంతుల్లో 105 నాటౌట్) అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండి యా 2 సిరీస్ కైవసం చేసుకుంది.