చెన్నై: చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులకు ఆలౌట్ అయింది. 339/6తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు మరో 37 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయా్ంది. భారత బ్యాటర్లలో రవి చంద్రన్ అశ్విన్ సెంచరీ(113) తో రాణించగా.. రవీంద్ర జడేజా(86), ఓపెనర్ యశస్వి జైశ్వాల్(56) అర్థ శతకాలు చేశారు. మిగతా బ్యాటర్లలో రిషబ్ పంత్ 36 పరుగులతో పర్వాలేదనిపించినా.. రోహిత్ శర్మ (06), విరాట్ కోహ్లీ(06), శుభమన్ గిల్ (0), కేఎల్ రాహుల్(16) తీవ్రంగా నిరాశ పరిచారు. ఇక 144 పరుగులకే కీలకమైన 6 వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకలలోతు కష్టాల్లో ఉన్న సమయంలో అశ్విన్, జడేజా ద్వయం ఆదుకుంది. ఈ జోడి 199 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొంది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 5 వికెట్లు తీయగా.. తస్కీట్ అహ్మద్ 3, నహీద్ రాణా, మెహదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.