calender_icon.png 25 October, 2024 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులకు పదోన్నతులివ్వాలి

15-07-2024 12:13:24 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): బీఈడీ అర్హత గల ఉపాధ్యాయులకు పీఎస్ హెచ్‌ఎం పదోన్నతులు కల్పించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య కోరా రు. ఆదివారం దోమలగూడలోని టీఎస్‌యూటీఎఫ్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బదిలీలు, పదోన్నతులు సజావుగా చేపట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపా రు. ఖాళీగా ఉన్న పోస్టులకు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు చేపట్టాలని కోరారు. పాఠశాలల్లో స్కా వెంజర్లను నియమించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాల ని, పీఆర్‌సీని ప్రకటించి 1 జూలై 2023 నుంచి అమలు చేయాలని కోరారు. ఈ కుబేర్‌లో ఉన్న పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని కోరారు.