calender_icon.png 23 February, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రబాబును విమర్శిస్తే ఇండ్లు ముట్టడిస్తాం

22-02-2025 06:44:31 PM

మాజీ మంత్రి జగదీశ్వర్​రెడ్డికి టీడీపీ నాయకుల హెచ్చరిక

జనగామ,(విజయక్రాంతి): టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu)పై అర్ధరహిత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్​చార్జ్ రామిని హరీశ్(Jangaon Constituency In-charge Ramini Harish)​ హెచ్చరించారు. శనివారం జనగామలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్​ రెడ్డి చంద్రబాబుపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. బీఆర్​ఎస్​ ప్లీనరీ సమావేశం(BRS Plenary Meeting)లో టీడీపీ, చంద్రబాబు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 2009లో చంద్రబాబుతో పొత్తు పెట్టకున్నది, హుజూర్​నగర్​లో బీఆర్​ఎస్​ గెలుపు  కోసం ప్రచారం చేసిన విషయాలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఏపీ, మహారాష్ట్రలో బీఆర్​ఎస్​ సొంత ప్రయోజనాలకు వాడుకుందని, అందుకే ఇక్కడి ప్రజలను ఆ పార్టీని తన్ని తరిమేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జేరిపోతుల కుమార్​, పట్టణ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి ఎల్లేష్ , ఎండీ.ఇక్బాల్​, దేవునూరి సంపత్​, గుగులోత్​ కనకరాజు, ఎండీ.యాకూబ్​ పాషా, తేజావత్​ అజయ్​ పాల్గొన్నారు.