calender_icon.png 11 October, 2024 | 6:55 PM

Breaking News

నాకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే..

11-10-2024 01:06:40 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంచి మిత్రుడు 

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి 

కిషన్‌రెడ్డికి పెళ్లి పత్రిక అందజేత

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీనే తనకు రాజకీయ భిక్ష పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచినట్లు తెలిపారు.

గురువారం ఆయన బీజేపీ కార్యా లయానికి వచ్చి తన మనవరాలి వివాహానికి రావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఆయన ఆహ్వాన పత్రిక అందజేశారు. కిషన్‌రెడ్డి తనకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసని, ఆయన బీజేపీలో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి స్థాయిదాకా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు.