calender_icon.png 26 October, 2024 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి టిఎన్టియుసి కార్యాలయం వద్ద సంబరాలు

01-09-2024 05:25:14 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా 30 ఏళ్ల అనుభవం సాధించడంతో ఆదివారం బెల్లంపల్లిలో టీఎన్టీయూసీ కార్యాలయం వద్ద టీడీపీ, టీఎన్టీయూసీ నాయకులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టీ మణి రామ్ సింగ్ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు భవిష్యత్ తరాలకు రూపకర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గద్దెల నారాయణ, బొల్లు మల్లయ్య, సిహెచ్. రమేష్, ఎండి హసన్, అల్పాల కుమార్, కాసర్ల వెంకటేష్, మేకల నర్సింగ్, యాదగిరి, ఆర్.గంగాధర్, డి.రాములు, బి.సత్యనారాయణ, ఏ.సరోజ, బి.అరుణ, ఎండి యాసిన్ లు పాల్గొన్నారు.