న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశంలో నంబర్వన్ ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారత స్టాక్ ఎక్సేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టయ్యి రెండు దశాబ్దాలు పూర్తయ్యింది. ‘2004లో టీసీఎస్ ఐపీవో జారీచేసి నేటికి 20 ఏండ్లు పూర్తయ్యిందంటూ’ కంపెనీ సీఈవో కృతివాసన్ నెట్వ ర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డెన్లో ఆదివారం పోస్తు చేశారు. ఈ రెండు దశాబ్దాల్లో పలు టెక్నాలజీ దశల్లో తమ క్లయింట్లకు సేవలందించామని, తమ కొలీగ్స్కు దీర్ఘకాలిక కెరీర్ ను కల్పించామని, తమ ఇన్వెస్టర్లకు సంపదను సృష్టించామని వివరించారు. క్లయిం ట్లకు, భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు.