వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబోలో రూపొందిన చిత్రం ‘మట్కా’ విడుదలకు సిద్ధంగా ఉంది. వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సినిమా నుంచి టీజర్ విడుదలతో అంచనాలు పెరిగాయి.
ఫస్ట్ సింగిల్ ‘లే లే రాజా..’కు మంచి స్పందన వచ్చింది. దీంతో మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. మట్కా నుంచి రెండో పాట ‘తస్సాదియ్యా..’ అక్టోబర్ 24న విడుదల కానుంది. వరుణ్ తేజ్ రెట్రో అవతార్లో కనిపించిన పాట విడుదల ప్రకటనకు సంబంధించిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలుగా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.