వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కింది. మీనాక్షి చౌదరి, నోరా పతేహి కథానాయికలుగా నటిస్తున్నారు. పిరియాడికల్ యాక్షన్ చిత్రంగా మట్కా రూపొందింది. ఇది నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజేందర్ రెడ్డి తీగల, రజిని తాళ్లూరి నిర్మాతలు.
గురువారం ఈ సినిమా నుంచి సెకం డ్ సింగిల్గా ‘తస్సాదియ్యా..’ అనే పాట విడుదలైంది. ‘యురేకా.. కూ ర్చుంటే ఏదీ రాదు.. నిలబడి చూస్తుం టే కాదు.. కలబడితే నీదే దునియా అంతా’ అంటూ సాగుతున్న ఈ పాట వింటుంటే సంగీత ప్రియులకు చిరు ‘యురేకా కసామిసా‘ గీతం గుర్తొస్తుంది. రెండు పాటలకూ సంబంధం లేకున్నా చిరుని మాత్రం వరుణ్ గుర్తు చేశారు. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం ఈ పాటను ఓ స్థాయికి తీసుకెళ్లింది. భాస్కరభట్ల రాసిన ఈ గీతాన్ని మనో ఆలపించారు.