“తేది: 12 బేస్తారం రోజున ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి గుడెనుక సమ్మక్క సారలమ్మ గద్దెల కాడ, మర్రిశెట్టు కింద జమ్మికుంట వాస్తవ్యులైన బూర సమ్మయ్య గౌడ్ బిడ్డ శ్రీలతకు పొత్కపల్లి గ్రామ వాస్తవ్యులైన గొడిశాల పోశాలు కొడుకు శ్రీనివాస్గౌడ్కి ‘ఇడుపు కాయితం’ పంచాయితీ జరుగుతాంది” అని రాసి ఉన్న యాభై రూపాయల స్టాంప్ పేపర్ ఆకట్టు కుంటోంది. ఏంటీ ఈ ‘ఇడుపు కాయితం’ కథా కమామిషూ అనుకుంటున్నారా?
తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రానికి సంబంధించి కాస్టింగ్ కాల్ ఇది! ఔను, వంశీ దొండపాటి రచ న, దర్శకత్వంలో యారో సినిమాస్, డోలాముఖి సబ్బల్ట్రాన్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి బూసం జగన్ మోహన్రెడ్డి, వేణు ఊడుగుల నిర్మాతలు. అక్టోబర్ 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు పేర్కొన్న మేకర్స్.. ఇడుపు కాయితంలో ప్రస్తావించటం ద్వారా ఇదే ఏడాది డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్టు చెప్పకనే చెప్పారు. ఏది ఏమైనా శ్రీనివాస్గౌడ్ అనే పాత్రధారి అతని భార్య శ్రీలత నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు సూచించే స్టాంప్ పేపర్తో యూనిక్ స్టయిల్లో అనౌన్స్మెంట్ ఇవ్వటం కొత్తగా ఉంది కదూ!