21-02-2025 12:00:00 AM
పద్మ సమర్పణలో పద్మిణి సినిమాస్ బ్యానర్పై బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ఇది. అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహ సం కాదు. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా రాజా’ టీం. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ను తమ్మారెడ్డి భరద్వాజ్ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రా రాజా మూవీ టైటిల్ను గమనిస్తే ఏదో ప్రేమ కథలా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో ఒక్క మొహం కూడా కనిపించదు. అసలు మొహాలు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. డ్యూయెల్ అని స్పీల్ బర్గ్ తీసిన చిత్రంలోనూ మొహం కనిపించదు. అలానే ఈ చిత్రంలోనూ మొహాలు కనిపించవని అంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రయోగం.
ఇది కనుక సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. అసలు హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు. ఇది అద్భుతమైన ఐడియా” అని పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.