15 June, 2026 | 7:17 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

తమిళనాడు డ్రాగన్స్ విజయం

14-01-2025 12:00 AM

భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) తమిళనాడు డ్రాగన్స్ మూడో విజ యాన్ని అందుకుంది. ఆదివారం ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 3 తో విజయాన్ని అందుకుంది. తమిళనాడు తరఫున జిప్ జాన్సెన్ (ఆట 6వ ని.లో ), నాథన్ ఎఫార్మస్ (19వ ని.లో), బ్లే గోవర్స్ (21వ ని.లో) గోల్స్ సాధించగా..

టోమన్ డిమినే (2వ, 37 ని.లో) ఢిల్లీకి డబుల్ గోల్స్ అందించాడు. మహిళల లీగ్‌లో బెంగాల్ టైగర్స్‌పై 1 తేడాతో సూర్మా  గెలుపును అందుకుంది.  షానన్ (38వ ని.లో), చార్లెట్ (42వ ని.లో), సలిమా టిటే (44వ ని.లో), సోనమ్ (47వ ని.లో) సూర్మాకు గోల్స్ అందించగా.. హన్నా కాటర్ (7వ ని.లో) బెంగాల్ టైగర్స్‌కు ఏకైక గోల్ అందించాడు. నేడు టీమ్ గొనాసికాతో సూర్మా హాకీ క్లబ్ తలపడనుంది.