calender_icon.png 26 October, 2024 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా గురించే మాట్లాడితే విసుగొస్తుంది

26-10-2024 12:00:00 AM

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరు చుకున్న కథానాయికల్లో సాయి పల్లవి పేరు ప్రస్తుతం ముందువరుసలోనే వినిపిస్తుంది. అంతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘రామాయణ’తో బాలీవుడ్‌లో తన మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె నటించిన ‘అమరన్’ విడుదలకు సిద్ధమవడంతో ఆ సినిమా ప్రమోషన్స్ పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలను ఉద్దేశించి సాయిపల్లవి కీలక వ్యాఖ్యలు చేసింది. లైమ్‌లైట్‌లో నిలవడం కోసం తరచూ అక్కడి నటీనటులు పీఆర్ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చు కుంటారని.. తాను బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సమ యంలో ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి దీని గురించే అడిగారని తెలిపింది.

“బాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను నేను ప్రమోట్ చేసుకోవడంతో పాటు తరచూ వార్తల్లో నిలిచేందుకు పీఆర్ టీమ్‌ను నియమించుకుం టారా? అని అడిగాడు. అలా చేస్తే ప్రేక్షకులు నా గురించి తరచూ మాట్లాడుకోవడంతోపాటు లైమ్‌లైట్‌లో ఉండగలను కానీ, దానివల్ల నాకు ఉపయోగం లేదు.

ఎందుకంటే అలా తరచూ నా గురించే మాట్లాడుకోవడం వల్ల ప్రేక్షకులకు విసుగొస్తుంది. అందుకే వద్దని చెప్పా” అని సాయిపల్లవి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘రామా యణ’లో రణబీర్ కపూర్ రాముడిగానూ.. సాయి పల్లవి సీతగానూ నటిస్తున్నారు.

రావణుడి పాత్రలో యశ్ నటిస్తున్నారు. ఇక ‘అమరన్’ చిత్రం ఉగ్ర దాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితా ధారంగా రూపొందింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.