03-03-2025 11:07:48 PM
నిజాం సాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాల విద్యార్థులు సైన్స్ ఫెయిర్ లో ఉత్తమ ప్రతిభ చూపారు. ఈ మేరకు హైదరాబాద్ లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులు రైల్వే ఆక్సిడెంట్ నిర్మూలన-ఇన్నోవేషన్ చాలెంజెస్ పై ప్రయోగం ప్రదర్శించారు. దీంతో స్టేట్ లెవల్ రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ ఆధ్వర్యంలో ట్రోఫీ, షీల్డ్ అందజేశారు. ఈ మేరకు విద్యార్థులతో పాటు గైడ్గా వ్యవహరించిన ఉపాధ్యాయురాలు చందనను పాఠశాల ప్రిన్సిపాల్ కార్తీక సంధ్య, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.