calender_icon.png 28 September, 2024 | 10:58 AM

బతుకమ్మ కుంటలో నిమజ్జనానికి చర్యలు తీసుకోండి

28-09-2024 02:19:36 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వీహెచ్ వినతి

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఏళ్లుగా మహిళలు అంబర్‌పేట చెరువులో బతుకమ్మలు నిమజ్జనం చేసే వారని, రా నురాను కొందరు అక్రమార్కులు చెరువునే అమ్ముకునే ప్రయత్నాలు చేశారని మాజీ ఎంపీ, సీనియర్ కాం గ్రెస్ నేత వీ హనుమంత్‌రావు పేర్కొన్నారు. హైడ్రా సరికొత్త నిర్ణయంతో చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు కూల్చేస్తున్నదని తెలిపారు.

అంబర్‌పేట బతుకమ్మ కుం టలో ఈ ఏడాది బతుకమ్మల నిమజ్జనానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కోర్టు కూడా బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ నిమ జ్జనం చేసేందుకు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.