13-02-2025 02:05:56 AM
పశు వైద్యాధికారి రవి కిరణ్
కామారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 12 : కామారెడ్డి పట్టణ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో తెలంగాణ పశుగాణభివృద్ధి సంస్థ నిజామాబాదు ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ రైతులు అందరూ ఈ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆవులు గేదెలు ఏవైనా కట్టనిచో వాటిని పరీక్షించి గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్స అందించడం జరిగింది మరియు లింగ నిర్ధారిత వీర్యము గురించి కూడా అవగాహన కల్పించారు.
ఈ లింగ నిర్ధారిత వీర్యము వాడడం వలన 90% ఆడదూడలు మాత్రమే జన్మిస్తాయని తెలిపారు దీనికిగాను రైతు వాటా 250 రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఒకే పశువుకు వరుసగా రెండు ఎదలలో లింగ నిర్ధారిత వీర్యము వాడిన చూలు కట్టకపోతే రైతు వాటా 500 రూపాయలు రైతు అకౌంట్ కు వాపస్ ఇవ్వబడును.
ఈ శిబిరంలో దాదాపు 79 గేదెలు చికిత్స చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో , కామారెడ్డి పశువైద్యాధికారి డాక్టర్ రవికిరణ్ , మరియు, రామారెడ్డి డాక్టర్ రాంచందర్ సూపర్వైజర్ కృష్ణ, మోహిన్, మరియు రావు , సెక్రెటరీ ప్రసాద్ , గోపాల మిత్రులుబాలయ్య , శ్రీనివాస్ , బాబాగౌడ్ ,మహిపాల్ రెడ్డి ,రైతులు పాల్గొన్నారు