calender_icon.png 10 March, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణినీ సద్వినియోగం చేసుకోండి

09-03-2025 06:10:31 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికల నేపథ్యంలో నిలిపివేయబడిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 10వ తేదీ(సోమవారం) నుండి నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఈ నెల 8వ తేదీన ముగియడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని యధాతథంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.