calender_icon.png 19 September, 2024 | 9:42 PM

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

27-07-2024 01:55:00 AM

మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ హన్మంతరెడ్డి 

గజ్వేల్, జూలై 26: వ్యాపార పరంగా ప్రోత్సహిస్తూ మహిళలకు అందిస్తున్న శ్రీనిధి రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ హన్మంతరెడ్డి సూచించారు. శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్‌సి రాజమౌళి, కమిషనర్ నర్సయ్య ఆధ్వర్యంలో మెప్మా మహిళా శక్తి అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి మాట్లాడుతూ.. మహిళలు వ్యాపార రంగంలో రాణించేందుకు శ్రీనిధి నుంచి రూ.లక్ష నుంచి రూ.20లక్షల రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం 30శాతం రాయితీతో శ్రీనిధి రుణాలు ఇస్తున్నట్లు హన్మంతరెడ్డి తెలిపారు.